చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి
చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన తాడూరి వీరయ్య గారి దశదిన కర్మ కార్యక్రమానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ వీరయ్య సామాజికంగా చురుకుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అలాగే గుండేబోయిన శ్రీలక్ష్మి సైదులు , 9వ వార్డ్ కౌన్సిలర్ ఎర్పుల పరమేష్, 4వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య కూడా పాల్గొని వీరయ్య గారి సేవలను స్మరించుకున్నారు.
మాజీ కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగని బిక్షం రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి