చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు
చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు
Komidala Mahender reddy
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల హామీని నిలబెట్టిన వేముల వీరేశం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన దేశపాక లత రాజేష్ పదవీ బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల లోపే ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేయడం విశేషం. ఎమ్మెల్యే సూచనలు, కౌన్సిలర్ చొరవతో ఈ కార్యక్రమం వేగవంతంగాఅమలైంది.ప్రాంతంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఉచితంగా శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో 7వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సదుపాయం వల్ల ఉపశమనం కలిగిందని తెలిపారు.
ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపడంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుంటారని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి