చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ
చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అయిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఉపాధ్యాయులుగా ఉండడం ఎంతో ఆనందంగా ఉందని , రోజు తమకు పాఠాలు చెప్పు గురువుల యొక్క కృషి అర్థమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు గ్రామ ఆరో వార్డు సభ్యురాలు సురిగి స్వప్న లింగస్వామి స్నాక్స్ బాక్సులు అందజేశారు. విద్యార్థులకు బహుమతులు అందించిన వారికి పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉప్పుల సైదులు, వార్డు సభ్యులు పాలెం శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి అంజయ్య, ఏ ఏ పీ సి చైర్మన్, వి పద్మ, ఉపాధ్యాయులు వి కృష్ణ, బి శివ, జి అనసూయ, వై సరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి