Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 09:37 PM

చిన్నారి హత్య కేసులో నిందితుల అరెస్టు చేయాలి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్

చిన్నారి హత్య కేసులో నిందితుల అరెస్టు చేయాలి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్

చిన్నారి హత్య కేసులో నిందితుల అరెస్టు చేయాలి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్
February 28, 2026 07:54 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నాగర్ కర్నూలు: కుమ్మెర గ్రామంలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అగ్రకుల అహంకారానికి బలైన రెండు నెలల పసిపాపకు న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం క్లాక్‌టవర్ సెంటర్‌లో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మల్లన్న జాతరకు వెళ్లిన బాధిత మహిళను తక్కువ కులానికి చెందినదని అవమానిస్తూ దర్శనానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, పసిపాపను తన్నడంతో మృతి చెందిందని ఆరోపించారు.

ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, నాయకులు రఘువరన్, మేడి కిరణ్, భూక్యా రాథోడ్ నాయక్, యాదగిరి, శివ, మాదాసు శ్రావణ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News