PRINT TIME: February 28, 2026 08:16 PM
చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి
చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి
February 28, 2026 06:39 PM
41 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ ఏఈ డి. సంజయ్ను కలిసి, ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులైన నాయి బ్రాహ్మణులకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రాయవరపు సీతారాములు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రవణపల్లి రామారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి