Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 08:16 PM

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి
February 28, 2026 06:39 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ ఏఈ డి. సంజయ్‌ను కలిసి, ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులైన నాయి బ్రాహ్మణులకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రాయవరపు సీతారాములు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రవణపల్లి రామారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News