చాట్రాయిలో జనసేనకు జోష్ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్ చేరిక
చాట్రాయిలో జనసేనకు జోష్ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్ చేరిక
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీటింగ్ ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అనంతరం నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు.
చిత్తపూరు గ్రామానికి చెందిన మాజీ వైసీపీ నాలుగో వార్డు సభ్యుడు జంగాల సురేష్ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కండువా కప్పించుకుని జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ చేరిక కార్యక్రమాన్ని చాట్రాయి జనసేన పార్టీ మండల నాయకులు వలసపల్లి రామకృష్ణ, సవరం రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు “జై జనసేన… వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం… వర్ధిల్లాలి బర్మా ఫణి బాబు నాయకత్వం” అంటూ నినాదాలు చేశారు.
మండలంలో జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి