Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:23 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
February 28, 2026 05:48 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ వర్కింగ్ మోడళ్లను తయారు చేసి ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను, సి.వి. రామన్ చేసిన ఆవిష్కరణలు దేశానికి తీసుకొచ్చిన గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలని, పరిశోధనా తత్వం పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరయ్య, నీల, సత్యనారాయణ రెడ్డి, రామరావు, ధనలక్ష్మి, వెంకటేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News