Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:27 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
February 28, 2026 05:48 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ వర్కింగ్ మోడళ్లను తయారు చేసి ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను, సి.వి. రామన్ చేసిన ఆవిష్కరణలు దేశానికి తీసుకొచ్చిన గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలని, పరిశోధనా తత్వం పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరయ్య, నీల, సత్యనారాయణ రెడ్డి, రామరావు, ధనలక్ష్మి, వెంకటేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News