చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ వర్కింగ్ మోడళ్లను తయారు చేసి ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను, సి.వి. రామన్ చేసిన ఆవిష్కరణలు దేశానికి తీసుకొచ్చిన గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలని, పరిశోధనా తత్వం పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరయ్య, నీల, సత్యనారాయణ రెడ్డి, రామరావు, ధనలక్ష్మి, వెంకటేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి