చప్తా గ్రామంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు
చప్తా గ్రామంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం చప్తా (కే) గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మహాత్మా జ్యోతి సర్వోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన లైబ్రరీని ఏర్పాటు చేసి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమహారతి, ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై లైబ్రరీ గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ మెత్రి సునీతమ్మ, మాజీ సర్పంచ్ గంగయ్యస్వామి, ఉపసర్పంచ్ బస్వారాజ్, వార్డ్ సభ్యులు నందు, లక్ష్మి సాయిగొండ తదితరులు అతిథులను ఘనంగా స్వాగతించారు.ఈ సందర్భంగా చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ, గ్రామ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అలాగే మహాత్మా జ్యోతి సర్వోదయ ఫౌండేషన్ చైర్మన్ సుధాకర్ చేసిన సేవలను కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు చదివే అవకాశం పెరిగి, వారి జ్ఞానం విస్తరించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి