బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ
బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సీఐ రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యువతకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని అన్నారు. ముఖ్యంగా యువత మత్తుకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేరాలకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.డ్రగ్స్ లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ముఖ్యంగా యువత ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా రవాణా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామ స్థాయిలో అవగాహన పెంచితేనే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు.అనంతరం గ్రామస్థులు, యువతతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని సమాజ అభివృద్ధికి యువత తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీమ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత యువకులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి