Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:53 PM

బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ

బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ

బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ
March 13, 2026 08:10 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సీఐ రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యువతకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని అన్నారు. ముఖ్యంగా యువత మత్తుకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేరాలకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.డ్రగ్స్ లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ముఖ్యంగా యువత ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా రవాణా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామ స్థాయిలో అవగాహన పెంచితేనే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు.అనంతరం గ్రామస్థులు, యువతతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని సమాజ అభివృద్ధికి యువత తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీమ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత యువకులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News