బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్
బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్
Krishna
మనూర్ మండలం బోరంచ గ్రామంలో జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుతూ నిరుపేద కుటుంబానికి సహాయం అందించింది. గ్రామానికి చెందిన దేవనూర్ సంగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. జీఎంఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, జంగం రుద్రయ్య, స్వామి పాలడుగు రాములు, బందే ఇమ్రాన్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, మ్యాతిరి మల్లన్న, చాకలి మైపాల్, చాకలి నరసింహులు, బక్క పోచయ్య, దూరగొండ హనుమంతు, చెట్టు కింది సుబ్బన్న, ఒగ్గు నర్సింలు, పెద్దనోళ్ల నాగన్న, పెద్దనోళ్ల రాజు, పెద్దనోళ్ల మల్లేశం, పెద్దనోళ్ల అశోక్, దేవనూరి మాణిక్యప్ప, బ్యాగరి బాలప్ప, గొర్రెకంటి ఏసప్ప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి