Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:07 AM

బోరంచలో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి అభిషేకం – అనంతరం ఆలయం మూసివేత

బోరంచలో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి అభిషేకం – అనంతరం ఆలయం మూసివేత

బోరంచలో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి అభిషేకం – అనంతరం ఆలయం మూసివేత
03-03-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో, పవిత్రమైన మంజీర నది ఒడ్డున విరాజిల్లుతున్న ప్రసిద్ధి చెందిన బోరంచ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయం లో మంగళవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడినవి.ఆలయ అర్చకులు నాగేష్ స్వామి వారు అమ్మవారికి శాస్త్రోక్త విధానంలో పంచామృతాలతో పాటు గంగాజలంతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించి, అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ తిలకం దిద్దారు. పట్టువస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలతో పాటు వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఆలయం అంతటా భక్తి భావం వెల్లివిరిసింది.తదనంతరం అమ్మవారికి మంగళహారతి సమర్పించి, నైవేద్యం నివేదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.అనంతరం సంభవించిన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని శాస్త్రాచారం ప్రకారం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి దర్శనానికి అనుమతించబడును.

Sthanikam

బోరంచలో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి అభిషేకం – అనంతరం ఆలయం మూసివేత

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో, పవిత్రమైన మంజీర నది ఒడ్డున విరాజిల్లుతున్న ప్రసిద్ధి చెందిన బోరంచ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయం లో మంగళవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడినవి.ఆలయ అర్చకులు నాగేష్ స్వామి వారు అమ్మవారికి శాస్త్రోక్త విధానంలో పంచామృతాలతో పాటు గంగాజలంతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించి, అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ తిలకం దిద్దారు. పట్టువస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలతో పాటు వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఆలయం అంతటా భక్తి భావం వెల్లివిరిసింది.తదనంతరం అమ్మవారికి మంగళహారతి సమర్పించి, నైవేద్యం నివేదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.అనంతరం సంభవించిన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని శాస్త్రాచారం ప్రకారం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి దర్శనానికి అనుమతించబడును.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News