బోరంచలో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి అభిషేకం – అనంతరం ఆలయం మూసివేత
బోరంచలో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి అభిషేకం – అనంతరం ఆలయం మూసివేత
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో, పవిత్రమైన మంజీర నది ఒడ్డున విరాజిల్లుతున్న ప్రసిద్ధి చెందిన బోరంచ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయం లో మంగళవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడినవి.ఆలయ అర్చకులు నాగేష్ స్వామి వారు అమ్మవారికి శాస్త్రోక్త విధానంలో పంచామృతాలతో పాటు గంగాజలంతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించి, అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ తిలకం దిద్దారు. పట్టువస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలతో పాటు వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఆలయం అంతటా భక్తి భావం వెల్లివిరిసింది.తదనంతరం అమ్మవారికి మంగళహారతి సమర్పించి, నైవేద్యం నివేదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.అనంతరం సంభవించిన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని శాస్త్రాచారం ప్రకారం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి దర్శనానికి అనుమతించబడును.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి