బోరంచ గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శ్రీకారం
బోరంచ గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శ్రీకారం
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండలంలో ఉన్న బోరంచ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సాధికారత, స్వయం ఉపాధి అభివృద్ధి, సామాజిక–ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ పి. సంజీవరెడ్డి మరియు సురేష్ కుమార్ షేట్కార్ మరియు గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బోరంచ గ్రామ ఉపసర్పంచ్ మొల్ల కరీమ్, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సాయమ్మ, విఓఏ అనుసుజ,గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ వార్డు సభ్యులు మరియు సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ మహిళా సమాఖ్య భవనం గ్రామ మహిళలకు ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు,ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు,సామాజిక గౌరవానికి ఇది ఒక కీలకమైన అడుగని అభిప్రాయపడ్డారు.గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోరంచ గ్రామంలో ఈ మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మహిళల ఐక్యత, సాధికారత మరింత బలోపేతం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి