Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 05:58 PM

బోరంచ గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శ్రీకారం

బోరంచ గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శ్రీకారం

బోరంచ గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శ్రీకారం
February 25, 2026 05:21 PM 243 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండలంలో ఉన్న బోరంచ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సాధికారత, స్వయం ఉపాధి అభివృద్ధి, సామాజిక–ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ పి. సంజీవరెడ్డి మరియు సురేష్ కుమార్ షేట్కార్ మరియు గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బోరంచ గ్రామ ఉపసర్పంచ్ మొల్ల కరీమ్, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సాయమ్మ, విఓఏ అనుసుజ,గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ వార్డు సభ్యులు మరియు సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ మహిళా సమాఖ్య భవనం గ్రామ మహిళలకు ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు,ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు,సామాజిక గౌరవానికి ఇది ఒక కీలకమైన అడుగని అభిప్రాయపడ్డారు.గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోరంచ గ్రామంలో ఈ మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మహిళల ఐక్యత, సాధికారత మరింత బలోపేతం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News