భువనగిరి పట్టణ 22వ వార్డులోని నల్లగొండ చౌరస్తా వద్ద పెద్ద గుంతలను పూడ్చి వేయించిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్,
భువనగిరి పట్టణ 22వ వార్డులోని నల్లగొండ చౌరస్తా వద్ద పెద్ద గుంతలను పూడ్చి వేయించిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్,
Sthanikam District Staff Reporter
భువనగిరి పట్టణం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో నల్లగొండ చౌరస్తా న్యూ రాంనగర్ ఏరియాలో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి పూడ్చి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ మాట్లాడుతూ... సంవత్సరం పైగా కాలం నుండి ప్రమాదకరంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారిన జాతీయ రహదారి గుంత వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారని వార్డు ప్రజల ద్వారా ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ శాసనసభ్యులు శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆర్అండ్ బి అధికారులను ఆదేశించడం వారితో సమన్వయం చేసుకొని ఈరోజు యుద్ధ ప్రాతిపదికల గుంతను పూడ్చివేయించడం జరిగిందని వార్డు ప్రజలందరూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు,8వ వార్డు కౌన్సిలర్ తాహెరా మజర్ పాషా,బట్టు మహేందర్,వరుణ్,సాదిక్,సాయి రత్నాకర్ శివతేజ రోడ్లు భవనాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి