Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:50 PM

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం
01-03-2026 254 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: నూతనంగా ఎన్నికైన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు మరియు మిగతా కౌన్సిల్ సభ్యులకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శాలువాలు, పూలదండలు వేసి సన్మానించారు. ప్రజలకు సేవాభావంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వేద పండితులు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిండిసత్యం, ట్రెజరర్ శ్యాంసుందర్ ఘటాని, ప్రోగ్రాం చైర్మన్ గాదె శ్రీనివాస్, కో-చైర్మన్ పోకల సోమన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటి మల్ల రాములు, మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, బెల్లిదే వెంకటేష్, పసుపునూరి నాగభూషణం, మంచాల రిషికేష్, చామ రవీందర్, మంచుకొండ వినోద్, చింతా రవి, రావుల శ్రీధర్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

Article Image

భువనగిరి: నూతనంగా ఎన్నికైన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు మరియు మిగతా కౌన్సిల్ సభ్యులకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శాలువాలు, పూలదండలు వేసి సన్మానించారు. ప్రజలకు సేవాభావంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వేద పండితులు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిండిసత్యం, ట్రెజరర్ శ్యాంసుందర్ ఘటాని, ప్రోగ్రాం చైర్మన్ గాదె శ్రీనివాస్, కో-చైర్మన్ పోకల సోమన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటి మల్ల రాములు, మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, బెల్లిదే వెంకటేష్, పసుపునూరి నాగభూషణం, మంచాల రిషికేష్, చామ రవీందర్, మంచుకొండ వినోద్, చింతా రవి, రావుల శ్రీధర్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News