Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 08:46 PM

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం
March 01, 2026 06:47 PM 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

భువనగిరి: నూతనంగా ఎన్నికైన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు మరియు మిగతా కౌన్సిల్ సభ్యులకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శాలువాలు, పూలదండలు వేసి సన్మానించారు. ప్రజలకు సేవాభావంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వేద పండితులు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిండిసత్యం, ట్రెజరర్ శ్యాంసుందర్ ఘటాని, ప్రోగ్రాం చైర్మన్ గాదె శ్రీనివాస్, కో-చైర్మన్ పోకల సోమన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటి మల్ల రాములు, మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, బెల్లిదే వెంకటేష్, పసుపునూరి నాగభూషణం, మంచాల రిషికేష్, చామ రవీందర్, మంచుకొండ వినోద్, చింతా రవి, రావుల శ్రీధర్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News