భూమయ్య సేవలు మరువలేనివి… కుటుంబానికి ధైర్యం చెప్పిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి
భూమయ్య సేవలు మరువలేనివి… కుటుంబానికి ధైర్యం చెప్పిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం దామర్ చెర్వు గ్రామానికి చెందిన గ్రామ ఆప్తుడు, సర్పంచ్ నారాయణ చిన్నాన్నగా పేరుగాంచిన గొల్ల భూమయ్య మరణం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న వెంటనే దామర్ చెర్వు గ్రామానికి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, భూమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన భూమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పుతూ, భూమయ్య గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లింగారెడ్డి మాజీ ఎంపీటీసీ, జల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల మరియు గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని భూమయ్యకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి