కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రభావం కలిగిన పూజ్య డా. చెన్నబసవ పట్టదేవర 27వ స్మరణోత్సవం మరియు నాడోజ పూజ్య డా. బసవలింగ పట్టదేవర అమృత మహోత్సవం సందర్భంగా భాల్కి పట్టణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ హాజరై గురువుల సేవలను స్మరించారు.ఈ సందర్భంగా భాల్కికి వచ్చిన ఎంపీని అఖిల మహోజ్వల సమితి సభ్యులు ఘనంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని సమాజానికి మార్గదర్శకులైన గురువుల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి నివాళులర్పించారు. వీరశైవ బసవేశ్వర జయంతి ఉత్సవాలు, బసవ జాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.ఈ కార్యక్రమంలో అఖిల మహోజ్వల సమితి సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PRINT TIME: August 07, 2026 01:08 AM
భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ
భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ
22-04-2026
150 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రభావం కలిగిన పూజ్య డా. చెన్నబసవ పట్టదేవర 27వ స్మరణోత్సవం మరియు నాడోజ పూజ్య డా. బసవలింగ పట్టదేవర అమృత మహోత్సవం సందర్భంగా భాల్కి పట్టణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ హాజరై గురువుల సేవలను స్మరించారు.ఈ సందర్భంగా భాల్కికి వచ్చిన ఎంపీని అఖిల మహోజ్వల సమితి సభ్యులు ఘనంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని సమాజానికి మార్గదర్శకులైన గురువుల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి నివాళులర్పించారు. వీరశైవ బసవేశ్వర జయంతి ఉత్సవాలు, బసవ జాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.ఈ కార్యక్రమంలో అఖిల మహోజ్వల సమితి సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి