Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 08:24 PM

భక్తులకు తలంబ్రాలు ఇంటికే… ఆర్‌టీసీ కార్గో ప్రత్యేక సేవలు

భక్తులకు తలంబ్రాలు ఇంటికే… ఆర్‌టీసీ కార్గో ప్రత్యేక సేవలు

భక్తులకు తలంబ్రాలు ఇంటికే… ఆర్‌టీసీ కార్గో ప్రత్యేక సేవలు
March 02, 2026 06:48 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

ఈనెల 27న భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

ఈనెల 27న భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు టి.జి.ఎస్.ఆర్.టి.సి శుభవార్త అందించింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టి.జి.ఎస్.ఆర్.టి.సి) రాణిగంజ్ డిపో కార్గో లాజిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో కళ్యాణానికి స్వయంగా హాజరు కాలేని భక్తుల కోసం స్వామివారి తలంబ్రాలను నేరుగా వారి ఇంటి వద్దకే చేరవేసే ప్రత్యేక సేవను ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను రాణిగంజ్ డిపో మేనేజర్ ఏ. శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు తమ కోసమే కాకుండా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం కూడా కళ్యాణ తలంబ్రాలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ సీతారాముల వారి దివ్య ఆశీస్సులు పొందాలని సూచించారు.

తలంబ్రాల బుకింగ్ మరియు ఇతర వివరాలకు 9346581213 నంబర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ సురేష్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News