బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్కు భూమిపూజ
బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్కు భూమిపూజ
స్థానికం బృందం
ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం బేలగుండ ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ, ఆలూరు ఇంచార్జి జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, కురువ కార్పొరేషన్ చైర్మన్ కురువ దేవేంద్రప్ప, మాజీ జడ్పీటీసీలు ఏకుంఠం ప్రసాద్, మీనాక్షినాయుడు, ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షుడు వెంకటేష్, ఆలూరు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, టీడీపీ బీసీ విభాగ ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు, వడ్డెమన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి