బాలల రక్షణ, మాదక ద్రవ్యాల నివారణపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
బాలల రక్షణ, మాదక ద్రవ్యాల నివారణపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
Krishna
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా బాలల సంక్షేమం, యువత అభివృద్ధి లక్ష్యంగా భరోసా, ఎ.హెచ్.టి.యు, షీ-టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 6 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలల రక్షణ, చైల్డ్ సేఫ్టీ, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. పిల్లలు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. బాలలపై నేరాల నిరోధంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎ.హెచ్.టి.యు ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, షీ-టీమ్ ఎస్ఐ పూలభాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి