Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:05 AM

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం
02-03-2026 273 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో వట్ పల్లి మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలను నిర్వహించారు.భార్గవి ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించగా, ఆర్మాన్ జిల్లా విద్యాధికారిగా, జ్యోతిక మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అక్షిత జిల్లా కలెక్టర్ పాత్రను నిర్వర్తించగా, కౌశిక్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అలాగే మనీషా, రేణుక, వర్ష, సంకీర్తన, శ్రీరామ్, విశ్వతేజ, లక్షిత్, నితిన్, మనోహర్, మల్లేష్ ఉపాధ్యాయులుగా తరగతులు నిర్వహించి పాఠాలు బోధించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని ప్రదర్శించారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు రితిన్ రెడ్డి, సంగయ్య, రవీందర్ పాల్గొన్నారు.స్వయంపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Sthanikam

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

Article Image

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో వట్ పల్లి మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలను నిర్వహించారు.భార్గవి ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించగా, ఆర్మాన్ జిల్లా విద్యాధికారిగా, జ్యోతిక మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అక్షిత జిల్లా కలెక్టర్ పాత్రను నిర్వర్తించగా, కౌశిక్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అలాగే మనీషా, రేణుక, వర్ష, సంకీర్తన, శ్రీరామ్, విశ్వతేజ, లక్షిత్, నితిన్, మనోహర్, మల్లేష్ ఉపాధ్యాయులుగా తరగతులు నిర్వహించి పాఠాలు బోధించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని ప్రదర్శించారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు రితిన్ రెడ్డి, సంగయ్య, రవీందర్ పాల్గొన్నారు.స్వయంపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News