బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం
బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం
Krishna
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో వట్ పల్లి మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలను నిర్వహించారు.భార్గవి ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించగా, ఆర్మాన్ జిల్లా విద్యాధికారిగా, జ్యోతిక మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అక్షిత జిల్లా కలెక్టర్ పాత్రను నిర్వర్తించగా, కౌశిక్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అలాగే మనీషా, రేణుక, వర్ష, సంకీర్తన, శ్రీరామ్, విశ్వతేజ, లక్షిత్, నితిన్, మనోహర్, మల్లేష్ ఉపాధ్యాయులుగా తరగతులు నిర్వహించి పాఠాలు బోధించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని ప్రదర్శించారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు రితిన్ రెడ్డి, సంగయ్య, రవీందర్ పాల్గొన్నారు.స్వయంపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి