Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:29 PM

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం
March 02, 2026 04:20 PM 259 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో వట్ పల్లి మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలను నిర్వహించారు.భార్గవి ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించగా, ఆర్మాన్ జిల్లా విద్యాధికారిగా, జ్యోతిక మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అక్షిత జిల్లా కలెక్టర్ పాత్రను నిర్వర్తించగా, కౌశిక్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అలాగే మనీషా, రేణుక, వర్ష, సంకీర్తన, శ్రీరామ్, విశ్వతేజ, లక్షిత్, నితిన్, మనోహర్, మల్లేష్ ఉపాధ్యాయులుగా తరగతులు నిర్వహించి పాఠాలు బోధించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని ప్రదర్శించారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు రితిన్ రెడ్డి, సంగయ్య, రవీందర్ పాల్గొన్నారు.స్వయంపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News