బాధలో ఉన్న సాయిలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
బాధలో ఉన్న సాయిలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన చాకలి సాయిలు మరణించిన విషయం తెలుసుకొని జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు బోరంచ గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. కుటుంబం ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, తమవంతుగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామంలో జరిగిన ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని సాయిలు కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో బోరంచ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లకుంట నర్సింలు, కొంగరి రవీందర్ రెడ్డి, చాకలి సత్యన, పుట్టి శివన్న, చిట్టికింది సుబ్బన్న, పుట్టి విట్టల్, పాలడుగు రాములు, ఎర్ర శ్రీశైలం, గొల్ల పాపని గోపాల్, అంజి రెడ్డి, దేవునూరి మాణిక్యప్ప, మ్యాతిరి మల్లన్న, గుడిమే విట్టల్, మొట్లకుంట లింగం, బాధర్గం లింగం తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి