Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 06:37 AM

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి
February 25, 2026 08:41 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్

సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తిగా సాధించేందుకు అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో, చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. జిల్లాకు ఈ ఏడాది 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించగా,ఇప్పటికే 1,850 ఎకరాల్లో సాగు జరిగినట్లు తెలిపారు.మిగిలిన లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకు లక్ష్యానికి మించి విస్తీర్ణంలో సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన,సెరికల్చర్ శాఖల అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, వరికి ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటగా రైతులు దీనిని స్వీకరించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఆర్థిక లాభాలను రైతులకు అర్థమయ్యే విధంగా వివరించాలని తెలిపారు.అదేవిధంగా జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, రైతు బీమా సంబంధిత అంశాలను త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వర్, గోద్రెజ్ సంస్థ జనరల్ మేనేజర్ స్వీటీ, ఉద్యానవన మరియు వ్యవసాయ శాఖల అధికారులు, ఏ.డి.ఏలు, ఏ.ఈ.ఓలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News