Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:06 PM

ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన

ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన

ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన
April 14, 2026 02:31 PM 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సభ్యులు

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి అఖిల్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవలను చాటారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కమిటీ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News