ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన
ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన
Krishna
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సభ్యులు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి అఖిల్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవలను చాటారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కమిటీ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి