ఆరోగ్య రక్షణకు ముందడుగు – వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కార్యక్రమం
ఆరోగ్య రక్షణకు ముందడుగు – వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కార్యక్రమం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ 9వ వార్డులో ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు శనివారం వార్డు కౌన్సిలర్ బణపూర్ రాజు స్వయంగా పర్యవేక్షణలో వాటర్ ట్యాంక్ శుభ్రపరిచే పనులు చేపట్టించారు. ట్యాంక్లో పేరుకుపోయిన మురికి, మలినాలను పూర్తిగా తొలగించి శుభ్రపరిచడంతో పాటు ట్యాంక్కు టాప్ ఫిట్టింగ్ పనులు కూడా నిర్వహించి నీటి లీకేజీలు లేకుండా, నీరు శుభ్రంగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా సదుపాయం కల్పించబడిందని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి నాణ్యతను కాపాడటం అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ చర్యను అభినందిస్తూ కౌన్సిలర్కు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి