Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్ పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 02:52 AM

ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..
March 21, 2026 06:18 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

యశోద ఆసుపత్రి నిపుణులచే 600 మందికి వైద్య పరీక్షలు..

నల్గొండ : నిరుపేదల ఆరోగ్యానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణమరాజు, పిల్లి శివకృష్ణ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మలకపేట యశోద ఆసుపత్రి, ఆర్కేఎస్ (RKS) ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ప్రేరణ పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక 10వ డివిజన్ కార్పొరేటర్ చొరవతో నిర్వహించిన ఈ శిబిరానికి పట్టణంలోని వివిధ డివిజన్ల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. యశోద ఆసుపత్రికి చెందిన గుండె నిపుణులు డాక్టర్ వీరారెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ షైనీ, జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ గోపీనాథ్ రోగులకు పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు 600 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.శిబిరంలో ప్రధానంగా 2డీ ఎకో (2D Echo), ఈసీజీ, బీపీ, షుగర్, మధుమేహం, హిమోగ్లోబిన్ (Hb) పరీక్షలతో పాటు కంటి పరీక్షలు, స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను చేరువ చేయడమే తమ ఫౌండేషన్ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రేరణ స్కూల్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బానోత్ రవి నాయక్, గంగరబోయిన వెంకన్న, ఐతరాజు జానయ్య, పుల్లెంల మహేష్, జ్యోతి, కృష్ణ, అశోక్ రెడ్డి, నామ ప్రకాష్, వెంకటాచారి పాల్గొన్నారు. అలాగే బీజేపీ ఇన్చార్జి కందుల శ్రీను, ఉమాదేవి, యశోద ఆసుపత్రి సీనియర్ ఎగ్జిక్యూటివ్ (పి.ఆర్.ఓ) అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News