అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్
అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్
Krishna
గురువారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కంగ్టి మండలం బిమ్రా గ్రామంలో గంగశెట్టి కిరాణా దుకాణం ముందు కొంతమంది పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే కంగ్టి ఎస్సై మరియు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ఆకస్మిక దాడి నిర్వహించారు.దాడి సమయంలో 07 మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి మొత్తం రూ. 9,020 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.పేకాట ఒక చెడు వ్యసనం. ఇది కుటుంబాలను నాశనం చేస్తుంది. అప్పుల బారిన పడేలా చేస్తుంది. చివరకు మద్యం వంటి మరిన్ని దుర్వ్యసనాలకు దారి తీస్తుంది. కంగ్టి మండలంలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా 8712656760 నంబర్కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎవరినీ ఉపేక్షించరు. మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి