Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:47 PM

అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్

అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్

అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్
February 15, 2026 02:54 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గురువారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కంగ్టి మండలం బిమ్రా గ్రామంలో గంగశెట్టి కిరాణా దుకాణం ముందు కొంతమంది పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే కంగ్టి ఎస్సై మరియు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ఆకస్మిక దాడి నిర్వహించారు.దాడి సమయంలో 07 మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి మొత్తం రూ. 9,020 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.పేకాట ఒక చెడు వ్యసనం. ఇది కుటుంబాలను నాశనం చేస్తుంది. అప్పుల బారిన పడేలా చేస్తుంది. చివరకు మద్యం వంటి మరిన్ని దుర్వ్యసనాలకు దారి తీస్తుంది. కంగ్టి మండలంలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 8712656760 నంబర్‌కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎవరినీ ఉపేక్షించరు. మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News