Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి
03-03-2026 285 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అప్పుల ఒత్తిడి కుటుంబంలో విషాదానికి దారితీసిన ఘటన చిట్యాల మండలం పరిధిలోని సుంకేనపల్లి గ్రామంలో వెలుగుచూసింది. లారీ కొనుగోలు సమయంలో తీసుకున్న అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బొజ్జ పావని (35) తన భర్త బొజ్జ శేఖర్‌తో కలిసి ఇటీవల లారీ కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న అప్పుల భారంతో గత నెల 25వ తేదీ రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన పావని క్షణికావేశంలో ఇంటి పక్కనే ఉన్న టర్పెంటైన్ ఆయిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మార్చి 3 ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.మృతురాలి తండ్రి పల్లెర్ల సాలయ్య (60), వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం నివాసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

Article Image

అప్పుల ఒత్తిడి కుటుంబంలో విషాదానికి దారితీసిన ఘటన చిట్యాల మండలం పరిధిలోని సుంకేనపల్లి గ్రామంలో వెలుగుచూసింది. లారీ కొనుగోలు సమయంలో తీసుకున్న అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బొజ్జ పావని (35) తన భర్త బొజ్జ శేఖర్‌తో కలిసి ఇటీవల లారీ కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న అప్పుల భారంతో గత నెల 25వ తేదీ రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన పావని క్షణికావేశంలో ఇంటి పక్కనే ఉన్న టర్పెంటైన్ ఆయిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మార్చి 3 ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.మృతురాలి తండ్రి పల్లెర్ల సాలయ్య (60), వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం నివాసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News