Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 03, 2026 08:06 PM

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి

అప్పుల భారం గృహిణి ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి
March 03, 2026 06:09 PM 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

అప్పుల ఒత్తిడి కుటుంబంలో విషాదానికి దారితీసిన ఘటన చిట్యాల మండలం పరిధిలోని సుంకేనపల్లి గ్రామంలో వెలుగుచూసింది. లారీ కొనుగోలు సమయంలో తీసుకున్న అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బొజ్జ పావని (35) తన భర్త బొజ్జ శేఖర్‌తో కలిసి ఇటీవల లారీ కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా తీసుకున్న అప్పుల భారంతో గత నెల 25వ తేదీ రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో మనస్తాపానికి గురైన పావని క్షణికావేశంలో ఇంటి పక్కనే ఉన్న టర్పెంటైన్ ఆయిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.

తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మార్చి 3 ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.మృతురాలి తండ్రి పల్లెర్ల సాలయ్య (60), వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం నివాసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News