అమెరికాలో ముగ్గురు వరంగల్ వాసుల మృతి – గుండెపోటుతో విషాదం
అమెరికాలో ముగ్గురు వరంగల్ వాసుల మృతి – గుండెపోటుతో విషాదం
Sthanikam joint District Staff Reporter krishna
అమెరికాలో స్థిరపడి కుటుంబంతో సంతోషంగా జీవించాలనే ఆశతో వెళ్లిన వరంగల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల వరుసగా గుండెపోటులతో వీరు కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది.వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (41) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.అదే విధంగా హనుమకొండకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమార్తె శ్వేత (41) కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే తన మనవడిని చూడటానికి అమెరికా వెళ్లిన చిదురాల విజయరాణి (55) అక్కడే అనారోగ్యానికి గురై మరణించారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న తీవ్రమైన పని ఒత్తిడి, అనియంత్రిత జీవనశైలి, సమయాభావం వంటి కారణాలు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనలు వరంగల్ ప్రాంత ప్రజల్లో తీవ్ర విషాదాన్ని రేపాయి. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖంలో మునిగిపోయారు. విదేశాల్లో ఉన్నవారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు మళ్లీ గుర్తుచేస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి