ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...
ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...
Harish HS
కె.ఆర్.ఆర్ కళాశాల 1974-76 బ్యాచ్ స్వర్ణోత్సవ సమ్మేళనం....
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.....
ఐదు దశాబ్దాల క్రితం విడిపోయిన ఆ నేస్తాలు మళ్ళీ కలిశారు. నాటి గురువుల ఆశీస్సులు తీసుకుంటూ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కోదాడలోని కె.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో ఇంటర్ (సీఈసీ) చదివిన విద్యార్థులు శుక్రవారం పట్టణంలోని జీపెప్ సర్వీసెస్ సెంటర్లో స్వర్ణోత్సవ స్నేహ సమ్మేళనం నిర్వహించారు. ఈ వేడుకకు విశ్రాంత అధ్యాపకులు సి.హెచ్. ప్రభాత్ కుమార్ చౌదరి, శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, ఎం. భరతరావు, మేరీ కుట్టి జోసెఫ్, సుధాకర్ హాజరై విద్యార్థులను అభినందించారు. నేటి కాలంలో 50 ఏళ్ల నాటి బంధాలను గుర్తుంచుకోవడం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు కె ఎస్ ఎన్ ప్రసాద్, ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, పోతుగంటి వెంకటాద్రి, బొడ్ల మదన్ మోహన్, స్వామి పుల్లయ్య, కందిబండ ప్రభాకర్, వై భిక్షం, వెంకటేశ్వర్లు, జాఫర్, షబ్బీర్, మట్టా కృష్ణా రెడ్డి పలు ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు నాటి బోధనేతర సిబ్బంది ఆలా, భిక్షం, బహదూర్, నారాయణ పాల్గొన్నారు....

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి