అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే
అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాండ్రపల్లి సుశీల (భర్త సాయిలు) నివాసం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయంగా మారింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు అనుపమ రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల పరిస్థితిని గమనించిన వారు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను అందజేసి ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు స్వప్న మోహన్ మాజీ జడ్పీటీసీ, సాయిలు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి