Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 02:56 PM

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే
April 24, 2026 01:00 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాండ్రపల్లి సుశీల (భర్త సాయిలు) నివాసం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయంగా మారింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు అనుపమ రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల పరిస్థితిని గమనించిన వారు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను అందజేసి ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు స్వప్న మోహన్ మాజీ జడ్పీటీసీ, సాయిలు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News