Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:13 AM

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి
March 14, 2026 06:26 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలను 18 వేల రూపాయలకు పెంచుతామని ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీల్లో ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని అన్నారు.అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల సంరక్షణ, పోషణ, విద్యా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి సరైన వేతనాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే కనీస వేతనాలను పెంచడంతో పాటు అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఐసీడీఎస్ పథకానికి ప్రభుత్వం తగినంత బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన అన్నారు. ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ టీచర్ల ద్వారానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పూర్తి నెల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 16 నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశముందని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News