Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:13 AM

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి
14-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలను 18 వేల రూపాయలకు పెంచుతామని ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీల్లో ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని అన్నారు.అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల సంరక్షణ, పోషణ, విద్యా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి సరైన వేతనాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే కనీస వేతనాలను పెంచడంతో పాటు అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఐసీడీఎస్ పథకానికి ప్రభుత్వం తగినంత బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన అన్నారు. ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ టీచర్ల ద్వారానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పూర్తి నెల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 16 నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశముందని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

Sthanikam

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి: చిరంజీవి

Article Image

అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలను 18 వేల రూపాయలకు పెంచుతామని ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీల్లో ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని అన్నారు.అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల సంరక్షణ, పోషణ, విద్యా కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి సరైన వేతనాలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే కనీస వేతనాలను పెంచడంతో పాటు అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఐసీడీఎస్ పథకానికి ప్రభుత్వం తగినంత బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన అన్నారు. ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ టీచర్ల ద్వారానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పూర్తి నెల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 16 నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశముందని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News