అంగన్వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి
అంగన్వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన “పోషణ పక్షం” కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆరోగ్యకరమైన తరం ఎదగాలంటే చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి అవసరమని, అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచి సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రికార్డుల నిర్వహణను సులభతరం చేయడం ద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, మైతాబ్, వివేకానంద, లక్ష్మణ్, కౌన్సిలర్లు, తాహెర్ అలీ, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి