అంధ దివ్యాంగురాలికి అండగా ‘వికలాంగుల హక్కుల సాధన సమితి’
అంధ దివ్యాంగురాలికి అండగా ‘వికలాంగుల హక్కుల సాధన సమితి’
K.RAVI
వీల్చైర్ అందజేతతో మెరవిన మానవత్వం
స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన పుట్టుకతో అంధ దివ్యాంగురాలు కందగట్ల శ్రీలతకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వీల్చైర్ను అందజేశారు.రాష్ట్ర మహిళా నాయకురాలు (కాంగ్రెస్ వికలాంగుల విభాగం) యశోద గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోదా వెంకటేష్ గౌడ్, గోదా గోవర్దన్ గౌడ్ అండగా నిలిచారు.ముఖ్య అతిథులుగా సర్పంచ్ భీమిడి ప్రదీప్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చేవెళ్లి శివకృష్ణ, వార్డు సభ్యులు పిట్టల శోభ సదానందం, చొప్పరి సాయి, బాతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి