Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:11 AM

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ
26-02-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఢిల్లీలోని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ – నారాయణఖేడ్ మార్గం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారి 161 (బి) అభివృద్ధి పనులకు రూ. 520 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార, వ్యవసాయ రంగాలకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.అలాగే కర్ణాటక సరిహద్దు నుండి బీదర్ వరకు మిగిలి ఉన్న ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసి, దానిని 161 (బి) రహదారితో అనుసంధానం చేయాలని కోరారు.ఈ అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభమై ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ఇక కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.పట్టణంలో మౌలిక వసతులు, రహదారులు,తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహాయం అవసరమని వివరించారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

Article Image

ఢిల్లీలోని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ – నారాయణఖేడ్ మార్గం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారి 161 (బి) అభివృద్ధి పనులకు రూ. 520 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార, వ్యవసాయ రంగాలకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.అలాగే కర్ణాటక సరిహద్దు నుండి బీదర్ వరకు మిగిలి ఉన్న ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసి, దానిని 161 (బి) రహదారితో అనుసంధానం చేయాలని కోరారు.ఈ అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభమై ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ఇక కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.పట్టణంలో మౌలిక వసతులు, రహదారులు,తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహాయం అవసరమని వివరించారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News