Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 08:52 PM

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ

అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి కేంద్ర సహకారం కోరిన:జహీరాబాద్ ఎంపీ
February 26, 2026 06:49 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna

ఢిల్లీలోని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ – నారాయణఖేడ్ మార్గం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారి 161 (బి) అభివృద్ధి పనులకు రూ. 520 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడి వ్యాపార, వ్యవసాయ రంగాలకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.అలాగే కర్ణాటక సరిహద్దు నుండి బీదర్ వరకు మిగిలి ఉన్న ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసి, దానిని 161 (బి) రహదారితో అనుసంధానం చేయాలని కోరారు.ఈ అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభమై ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.ఇక కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.పట్టణంలో మౌలిక వసతులు, రహదారులు,తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహాయం అవసరమని వివరించారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News