అభివృద్ధి హామీలకు ప్రజల మద్దతు – మహేందర్కర్ వివేకానంద విజయం
అభివృద్ధి హామీలకు ప్రజల మద్దతు – మహేందర్కర్ వివేకానంద విజయం
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్కర్ వివేకానంద 139 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై సాధించిన ఈ ఆధిక్యం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.ఫలితాలు ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ విజయాన్ని వేడుకగా మార్చుకున్నారు. ఎన్నికల సమయంలో వివేకానంద ప్రజల సమస్యలను సమగ్రంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటానని ఇచ్చిన హామీకి ప్రజలు మద్దతుగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు.విజయం అనంతరం మాట్లాడిన మహేందర్కర్ వివేకానంద, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 13వ వార్డు అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా మెరుగుదల, రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి చూపిస్తానని, వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సహకారం, నాయకుల మార్గదర్శకత్వంతో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి 13వ వార్డులో మరింత బలం చేకూరింది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి