Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్ కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 10:19 PM

అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు

అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు

అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు
April 13, 2026 08:42 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో బహుజన జిల్లా అధ్యక్షులు బి. శంకర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తరించే ఉద్దేశంతో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్‌లో లోండే నర్సింలు, రాములు నాయక్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News