అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు
అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో బహుజన జిల్లా అధ్యక్షులు బి. శంకర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తరించే ఉద్దేశంతో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్లో లోండే నర్సింలు, రాములు నాయక్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి