PRINT TIME: April 10, 2026 06:48 PM
అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం
అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం
April 10, 2026 04:59 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజా సంఘాల నాయకులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి