PRINT TIME: June 22, 2026 02:07 PM
అంబేద్కర్ భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన.
అంబేద్కర్ భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన.
April 11, 2026 04:30 PM
115 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ భవనంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, న్యాయవాది నాథన్ డానీ, సంజయ్ తదితరులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు పూలే సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకుంటూ, విద్యా ప్రాముఖ్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజ పురోగతికి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి