Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:12 AM

అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి
21-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహానుభావుడని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం లభిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ముఖ్యంగా యువత విద్య ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ గ్రామ సర్పంచ్, దత్తు బిరధర్ మానూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మోహన్ రెడ్డి, హన్మయ్య, భారత్, శ్రీశైలం, వివిధ గ్రామాల సర్పంచులు, బ్రహ్మానంద్ రెడ్డి మాజీ సర్పంచ్, విగ్రహ దాత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

Sthanikam

అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహానుభావుడని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం లభిస్తున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ముఖ్యంగా యువత విద్య ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ గ్రామ సర్పంచ్, దత్తు బిరధర్ మానూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మోహన్ రెడ్డి, హన్మయ్య, భారత్, శ్రీశైలం, వివిధ గ్రామాల సర్పంచులు, బ్రహ్మానంద్ రెడ్డి మాజీ సర్పంచ్, విగ్రహ దాత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News