Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:15 AM

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ
14-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్,గ్రామ వార్డు సభ్యులు కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు గ్రామంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే విలువలను ఆయన మనకు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Sthanikam

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్,గ్రామ వార్డు సభ్యులు కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు గ్రామంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే విలువలను ఆయన మనకు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News