అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ
అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్,గ్రామ వార్డు సభ్యులు కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు గ్రామంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే విలువలను ఆయన మనకు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి