Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్తటూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 06:28 PM

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ

అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం – బోరంచలో ప్రతిజ్ఞ
April 14, 2026 02:55 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్,గ్రామ వార్డు సభ్యులు కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు గ్రామంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే విలువలను ఆయన మనకు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News