Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 12:18 AM

8వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం

8వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం

8వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం
March 19, 2026 07:31 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ద్వారకానగర్‌లో రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ దేవాలయాలకు శంకుస్థాపన

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ద్వారకానగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి దేవాలయాల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మల కృపతో పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 8వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, వృద్ధాప్య పింఛన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మున్సిపాలిటీ నిధుల ద్వారా పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలోని ఇతర వార్డులతో పోలిస్తే 8వ డివిజన్ వెనుకబడి ఉందని, ఇక్కడ మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అనంతరం తన్నీరు స్వాతి భూషణం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ వజ్జ సంతోషిని రమేష్ యాదవ్, నల్గొండ లిఫ్ట్ సంఘం అధ్యక్షుడు వేముల లక్ష్మయ్య, 7వ డివిజన్ అధ్యక్షుడు స్వామి గౌడ్, 10వ డివిజన్ అధ్యక్షుడు చిన్నాల జానయ్య, మాజీ ఉపసర్పంచ్ జడల లింగయ్య, ఎండి జావిద్, పిల్లి రమేష్, వేముల నాగరాజు, కన్నెబోయిన వెంకన్న, మీనయ్య, తమ్మిశెట్టి జానయ్య తదితరులతో పాటు కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News