3న స్వర్ణగిరి క్షేత్రం కవాట బంధనం...
3న స్వర్ణగిరి క్షేత్రం కవాట బంధనం...
Sthanikam District Staff Reporter
కేతు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం.
నేడు ఒక ప్రకటనలో తెలిపిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణా చార్యులు.
తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో కేతు గ్రహస్థ సంపూర్ణ చంద్ర గ్రహణాన్నీ పురస్కరించుకొని మార్చి మూడో తారీఖు నాడు ఆలయంలో స్వామివారి దర్శనాలంనింటిని భక్తులందరికీ నిలిపివేయడం జరుగుతుంది. మూడో తారీఖు సుప్రభాత సేవ స్వామివారి నిత్య కైంకర్యాలంటిని సంపూర్ణం చేసుకుని స్వామి వారి ఆలయాన్ని కవాట బంధనం చేయడం జరుగుతుంది. తదుపరి తేది 4 బుధవారం రోజున శుద్ధి పుణ్య ఆవాచన లాంటి కార్యక్రమాలు , ఆలయం ప్రాంగణం మొత్తం సంప్రోక్షణ చేసుకున్న పిదప మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి స్వర్ణగిరిషుని దర్శనాలు పునర్ ప్రారంభం చేయడం జరుగుతుందని స్వర్ణగిరి ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణాచార్యులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి