PRINT TIME: June 22, 2026 02:16 PM
12వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం – రెండు బోరుబావులు ఏర్పాటు
12వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం – రెండు బోరుబావులు ఏర్పాటు
April 17, 2026 07:13 PM
317 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు మున్సిపల్ జనరల్ ఫండ్తో రెండు కొత్త బోరుబావులను ఏర్పాటు చేయించారు. రానున్న ఎండాకాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టగా, శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని భూమిపూజ చేసి బోరుమోటార్లను ప్రారంభించారు. అలాగే మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, వార్డు ప్రజలు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి