యువతకు క్రీడలతో ఆత్మవిశ్వాసం – చిట్యాలలో సంసద్ ఖేల్ మహోత్సవ్
యువతకు క్రీడలతో ఆత్మవిశ్వాసం – చిట్యాలలో సంసద్ ఖేల్ మహోత్సవ్
Editor Desk
యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో క్రీడా మహోత్సవాలు కీలకం అని భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, నకిరేకల్ నియోజకవర్గ స్థాయి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు, గేమ్స్ ఇన్చార్జి కంబాలపల్లి సతీష్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీదేవి రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి నకిరేకంటి మొగులయ్య హాజరై క్రీడలను ప్రారంభించారు.అనంతరం జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్రెడ్డి మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘అమృత్ పీఢి’కి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను అందించడంలో ఇలాంటి క్రీడా మహోత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే ఈ కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువకులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయన మహాలింగం, జోగు శేఖర్, గేమ్స్ కో-ఇన్చార్జి కన్నెబోయన మురళి, సీలేవేరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి