Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
March 25, 2026 05:14 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్ కార్యక్రమ భవనంలో స్పందన డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు, గురువుల మాటలు విని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాల మత్తు యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని హెచ్చరించారు.

ప్రతి పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అంతర్జాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, యంత్ర కార్డు వివరాలు, ఒకసారి ఉపయోగించే సంకేత సంఖ్యలను ఇతరులకు తెలియజేయకూడదన్నారు. సందేశాలలో వచ్చే అనుమానాస్పద లింకులను అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు. మోసాలపై 1930కు ఫిర్యాదు చేయాలని, వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధిస్తే వెంటనే ప్రత్యేక బృందానికి సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థినీలు క్రమశిక్షణతో ఉండి తల్లిదండ్రులు, గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు, ప్రధానోపాధ్యాయులు, ఇతర విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News