Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 08:35 PM

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది
April 26, 2026 06:55 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థినీ విద్యార్థులు యోగా నేర్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందుతుందని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణా కేంద్రం యోగ గురువు చాడ పాపిరెడ్డి, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం తెలిపారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థుల కోసం మే 10 వరకు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అవసరమని, ముఖ్యంగా బాల్య దశలో యోగా అలవాటు చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ శిక్షణ తరగతులు 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు మే 10న సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ యోగా తరగతులకు పంపించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కుంచపర్తి రాజశేఖర్, వందనపు వెంకటేశ్వర్లు, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి కట్టెకోల పూర్ణచంద్రరావు, యోగా ట్రైనర్ సుదర్శన్ రెడ్డి, యోగ సాధకులు శ్రీదేవి, దివ్య, సంధ్య, విజయలక్ష్మి, నాగరాజు, లింగయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News