Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:31 PM

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది
April 26, 2026 06:55 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థినీ విద్యార్థులు యోగా నేర్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందుతుందని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణా కేంద్రం యోగ గురువు చాడ పాపిరెడ్డి, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం తెలిపారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థుల కోసం మే 10 వరకు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అవసరమని, ముఖ్యంగా బాల్య దశలో యోగా అలవాటు చేసుకుంటే జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ శిక్షణ తరగతులు 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు మే 10న సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ యోగా తరగతులకు పంపించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కుంచపర్తి రాజశేఖర్, వందనపు వెంకటేశ్వర్లు, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి కట్టెకోల పూర్ణచంద్రరావు, యోగా ట్రైనర్ సుదర్శన్ రెడ్డి, యోగ సాధకులు శ్రీదేవి, దివ్య, సంధ్య, విజయలక్ష్మి, నాగరాజు, లింగయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News