యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం
యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం
Biksham
తెలంగాణ రాష్ట్రంలో యాదవ విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయనున్న వసతి గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం సమీకరించే లక్ష్యంతో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి
చదువుకుంటున్న యాదవ విద్యార్థులు సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు అభివృద్ధి కోసం వసతి గృహాల నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఇటీవల నిర్వహించిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్ను విద్యావంతుల వేదిక మరియు యాదవ మేధావుల తరఫున ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక కన్వినర్ ముక్కాల వెంకన్న, వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, ఉస్మానియా వీసీ రవీందర్ యాదవ్, చింతల రవీంద్రనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా వేదిక సభ్యులు కూడా హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి