Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లారీని ఢీకొట్టిన ఎర్టిగా కార్: సూర్యాపేట యువకుడు దుర్మరణం! కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 08:12 PM

యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి: కురునెళ్లి వెంకట్

యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి: కురునెళ్లి వెంకట్

యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి: కురునెళ్లి వెంకట్
May 27, 2026 07:21 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: వికలాంగుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునెళ్లి వెంకట్ ఆరోపించారు. భువనగిరి సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం, నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగుల పెన్షన్ పెంపుపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించడంతో పాటు వికలాంగులపై వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

మహిళా వికలాంగులకు రక్షణ కల్పించాలని, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వికలాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయడంతో పాటు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మే 29 నుంచి 31 వరకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వికలాంగుల చట్టాలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి లలిత, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, పాండాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News