Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:22 AM

యాదాద్రి ఇన్నోయాత్రకు ప్రేరణ. గ్రామీణ ఆవిష్కరణలపై ప్రత్యక్ష అధ్యయనం.. యాత్రికులకు కొత్త దిశ

యాదాద్రి ఇన్నోయాత్రకు ప్రేరణ. గ్రామీణ ఆవిష్కరణలపై ప్రత్యక్ష అధ్యయనం.. యాత్రికులకు కొత్త దిశ

యాదాద్రి ఇన్నోయాత్రకు ప్రేరణ. గ్రామీణ ఆవిష్కరణలపై ప్రత్యక్ష అధ్యయనం.. యాత్రికులకు కొత్త దిశ
March 27, 2026 08:59 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి పర్యటనలో భాగంగా నిర్వహించిన ఇన్నోయాత్ర అధ్యయనం, ప్రేరణ, గ్రామీణ అనుభవాలతో నిండిన రోజుగా నిలిచింది. యాత్రికులు తమ పర్యటనను యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనంతో ప్రారంభించి, ఆవిష్కరణల ప్రయాణానికి ఆశీర్వాదాలు పొందారు.

అనంతరం దత్తాయిపల్లి గ్రామంలోని అగ్రో ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించి, వ్యవసాయంలో విలువ వృద్ధి, గ్రామీణ వ్యాపారాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. గ్రామ సర్పంచ్ కరుణాకర్‌తో జరిగిన చర్చలో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై యాత్రికులు అవగాహన పొందారు. గ్రామీణ సమస్యలకు సరికొత్త ఆలోచనలను తీసుకురావాలని ఆయన సూచించారు.

తదుపరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన బృందం, అక్కడి సదుపాయాలను పరిశీలించింది. ప్రిన్సిపాల్ వివిధ కోర్సులు, ఆవిష్కరణలకు అందుబాటులో ఉన్న వసతులపై వివరించారు.

జిల్లా వ్యవసాయ అధికారి వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. రైతులకు యాంత్రీకరణ, మార్కెట్ అనుసంధానంపై కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇన్నోవేటర్లు సుధీర్, శివ, సందీప్ తమ అనుభవాలను పంచుకుని యాత్రికులకు ప్రేరణనిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News