యాదాద్రి పర్యటనలో భాగంగా నిర్వహించిన ఇన్నోయాత్ర అధ్యయనం, ప్రేరణ, గ్రామీణ అనుభవాలతో నిండిన రోజుగా నిలిచింది. యాత్రికులు తమ పర్యటనను యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనంతో ప్రారంభించి, ఆవిష్కరణల ప్రయాణానికి ఆశీర్వాదాలు పొందారు.
అనంతరం దత్తాయిపల్లి గ్రామంలోని అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించి, వ్యవసాయంలో విలువ వృద్ధి, గ్రామీణ వ్యాపారాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. గ్రామ సర్పంచ్ కరుణాకర్తో జరిగిన చర్చలో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై యాత్రికులు అవగాహన పొందారు. గ్రామీణ సమస్యలకు సరికొత్త ఆలోచనలను తీసుకురావాలని ఆయన సూచించారు.
తదుపరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించిన బృందం, అక్కడి సదుపాయాలను పరిశీలించింది. ప్రిన్సిపాల్ వివిధ కోర్సులు, ఆవిష్కరణలకు అందుబాటులో ఉన్న వసతులపై వివరించారు.
జిల్లా వ్యవసాయ అధికారి వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. రైతులకు యాంత్రీకరణ, మార్కెట్ అనుసంధానంపై కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్నోవేటర్లు సుధీర్, శివ, సందీప్ తమ అనుభవాలను పంచుకుని యాత్రికులకు ప్రేరణనిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి