వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.
వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.
Editor Desk
వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా అన్నారు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానం ఉన్న సందర్భాల్లో ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా బిల్లు తీసుకురావడం మంచి చర్యగా పేర్కొన్నారు. ఇది వృద్ధుల భద్రతకు తోడ్పడటమే కాకుండా కుటుంబ బాధ్యతలను గుర్తు చేస్తుందని అన్నారు.
అయితే వాస్తవ పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయరని, కుటుంబ పరువు, సంబంధాల కారణంగా మౌనంగా బాధను భరిస్తారని తెలిపారు.
కాబట్టి ఫిర్యాదు లేకపోయినా సంతానం జీతాల నుంచి నేరుగా తల్లిదండ్రులకు సహాయం అందేలా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అది సాధ్యం కాకపోతే ప్రతి వృద్ధునికి షరతుల్లేకుండా ఆసరా పెన్షన్ అందించాలని సూచించారు.
ఇలాంటి చర్యలతో కుటుంబాల్లో వివాదాలు తగ్గి, బంధాలలో గౌరవం, ప్రేమ పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి