Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:26 AM

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.
25-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా అన్నారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానం ఉన్న సందర్భాల్లో ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా బిల్లు తీసుకురావడం మంచి చర్యగా పేర్కొన్నారు. ఇది వృద్ధుల భద్రతకు తోడ్పడటమే కాకుండా కుటుంబ బాధ్యతలను గుర్తు చేస్తుందని అన్నారు.

అయితే వాస్తవ పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయరని, కుటుంబ పరువు, సంబంధాల కారణంగా మౌనంగా బాధను భరిస్తారని తెలిపారు.

కాబట్టి ఫిర్యాదు లేకపోయినా సంతానం జీతాల నుంచి నేరుగా తల్లిదండ్రులకు సహాయం అందేలా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అది సాధ్యం కాకపోతే ప్రతి వృద్ధునికి షరతుల్లేకుండా ఆసరా పెన్షన్ అందించాలని సూచించారు.

ఇలాంటి చర్యలతో కుటుంబాల్లో వివాదాలు తగ్గి, బంధాలలో గౌరవం, ప్రేమ పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

వృద్ధుల కోసం ప్రభుత్వ చర్యలకు మద్దతు.

Article Image

వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా అన్నారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానం ఉన్న సందర్భాల్లో ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా బిల్లు తీసుకురావడం మంచి చర్యగా పేర్కొన్నారు. ఇది వృద్ధుల భద్రతకు తోడ్పడటమే కాకుండా కుటుంబ బాధ్యతలను గుర్తు చేస్తుందని అన్నారు.

అయితే వాస్తవ పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయరని, కుటుంబ పరువు, సంబంధాల కారణంగా మౌనంగా బాధను భరిస్తారని తెలిపారు.

కాబట్టి ఫిర్యాదు లేకపోయినా సంతానం జీతాల నుంచి నేరుగా తల్లిదండ్రులకు సహాయం అందేలా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అది సాధ్యం కాకపోతే ప్రతి వృద్ధునికి షరతుల్లేకుండా ఆసరా పెన్షన్ అందించాలని సూచించారు.

ఇలాంటి చర్యలతో కుటుంబాల్లో వివాదాలు తగ్గి, బంధాలలో గౌరవం, ప్రేమ పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News